విజయవాడలో విషాదం..విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-25 17:21:12  IST  )

విజయవాడలో విషాదం చోటు చేసుకుంది....

విజయవాడలో విషాదం..విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌(Current Shock)తో ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. గొల్లపాలెంగట్టు(Gollapalam Gattu)కు చెందిన మానస్.. బిస్కెట్లు(Biscuits) కొనుక్కునేందుకు ఇంటి నుంచి షాపు వద్దకు వెళ్లాడు. అయితే వెళ్తూ, వెళ్తూ దారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా బాలుడు మానస్ ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అందరూ చూస్తుండగా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందారని స్థానికులు మండిపడ్డారు.

Next Story