ఉపాధి కూలీలపై విరుచుకుపడ్డ తేనెటీగలు.. ఐదుగురి పరిస్థితి విషమం

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేసుకుంటున్న కూలీలపై ఒక్కసారిగా తేనెటీగలు విరుచుకుపడ్డాయి..

ఉపాధి కూలీలపై విరుచుకుపడ్డ తేనెటీగలు.. ఐదుగురి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) పెదపూడి మండలం కరకుదురు(Karakuduru) గ్రామంలో గురువారం విషాదం(Tragedy) చోటుచేసుకుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేసుకుంటున్న కూలీలపై ఒక్కసారిగా తేనెటీగలు(Bees) విరుచుకుపడ్డాయి. ఈ పరిణామంతో భయాందోళనకు గురైన కూలీలు ప్రాణ రక్షణ కోసం పరుగులు తీశారు. అయినప్పటికీ తేనెటీగల దాడిలో మొత్తం 24 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి కూడా ప్రాథమిక చికిత్స అందించి పర్యవేక్షిస్తున్నారు. ఉపాధి పనుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు అధికారులకు ముందే సమాచారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story