- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్డెస్క్: ఎగువన కురుస్తోన్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు వద్ద నీటిమట్టం క్రమంగా పెరగడంతో.. దిగువ కాపర్ డ్యామ్ సమీపంలో నదిలో జేసీబీ మునిగిపోయింది. దీంతో ఆ జేసీబీని బయటకు తీసుకువచ్చేందుకు తాడు వేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఇద్దరు నదిలో పడి గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమవ్వగా.. అతడిని డ్యామ్ ఇంజినీర్ గా గుర్తించారు. మిషన్ ఆపరేటర్ ఆచూకీ కోసం మత్స్యకారులు, రెస్క్యూ టీమ్ గాలిస్తున్నారు. కాగా.. ఇంజినీర్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం పోలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మత్స్యకారులకు మంత్రి అచ్చెన్న విజ్ఞప్తి
మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర తీరంలోని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని క్రమంలో వేటకు వెళ్లొద్దన్నారు. రేపటి వరకూ మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకుండా మత్స్యకారులు సహకరించాలని మంత్రి అచ్చెన్న అన్నారు.






