- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి భారీగా సమయం
నేటితో విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగియనున్న క్రమంలో.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

దిశ, వెబ్డెస్క్: నేటితో విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగియనున్న క్రమంలో.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి.. గో గర్భం డ్యామ్ వరకూ క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. నిన్న (శనివారం) స్వామివారిని 92,830 మంది భక్తులు దర్శించుకోగా.. 48,987 మంది భక్తులు తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న 4.64 లక్షల లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగినట్లు టీటీడీ పేర్కొంది. వెంగమాంబ అన్నదాన సత్రం సహా.. కొండపై 3.37 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.






