- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రామయ్యకు వెంకన్న లడ్డూలు.. ప్రత్యేక విమానంలో అయోధ్యకు తరలింపు
by Disha Web Desk 16 |
X
దిశ తిరుమల: అయోధ్య రాములవారికి తిరుమల వెంకన్న లడ్డూలు సిద్ధమయ్యాయి. ఈ నెల 22న అయోధ్యలో రామయ్య విగ్రహ ప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్యకు వచ్చే శ్రీరామ భక్తులకు తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రసాదంగా లడ్డూలను అందించనున్నారు. ప్రతి భక్తుడికి 25 గ్రాముల బరువైన చిన్న లడ్డూను అందించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మొత్తం లక్ష లడ్డూలను రెడీ చేశారు.
గురువారం తిరుమల శ్రీవారి సేవాసదన్-1లో లడ్డూ ప్యాకింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. రెండు చిన్న లడ్డూలతో ప్యాకెట్లు ఏర్పాట్లు చేశారు. ఇలా మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. ఈ లడ్డూ ప్యాకింగ్లను అయోధ్యకు పంపేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని రేపు కార్గో విమానంలో పంపించనున్నారు.
Next Story