చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌డెడ్

by Vemula.Srinu Prasad |

చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు..

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor District)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(road accident)లో ముగ్గురు దుర్మరణం చెందారు. గంగాధర నెల్లూరు మండలం ఎట్టేరి గ్రామం వద్ద స్కూటర్‌(Scooter)ను ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటర్‌పై వెళ్తున్న ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story