- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: విజయవాడలో భారీ వర్షాలకు ముగ్గురు మృతి
విజయవాడలో భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు...

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో భారీగా వర్షాలు(Rains) కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు, మ్యాన్హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందగా.. డ్రైనేజీలో పడి మరొకరు, చెట్టు కూలి ఇంకొకరు మృతి చెందారు. దీంతో వారి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. నగర ప్రజలకు విజయవాడ కార్పొరేషన్ అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని తెలిపారు.
Next Story






