ఈసారి కృష్ణా నుంచి: అక్టోబర్ 1 నుంచి పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర

by Disha Web Desk 21 |
ఈసారి కృష్ణా నుంచి: అక్టోబర్ 1 నుంచి పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మలివిడత వారాహి విజయయాత్రకు రెడీ అవుతున్నారు. ఈసారి ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి నాలుగో విడత విజయయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. అక్టోబర్ 1 నుంచి ఈ నాలుగో విడత వారాహి యాత్రను అవని గడ్డ నుంచిప్రారంభించబోతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నాల్గవ విడతలో అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాలలో వారాహి విజయయాత్ర కొనసాగుతుందని తెలిపారు. మచిలీపట్నం కేంద్రంగానే నాలుగు నియోజకవర్గాలలో వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని తెలిపింది. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నాలుగు నియోజకవర్గాల నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారాహి విజయయాత్రను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

Next Story

Most Viewed