నాయకుడు అంటే ప్రజలకు నమ్మకంగా ఉండాలి.. CM జగన్

by Disha Web Desk 4 |
నాయకుడు అంటే ప్రజలకు నమ్మకంగా ఉండాలి.. CM జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: నాయకుడు అంటే ప్రజలకు నమ్మకం ఉండాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. మంగళవారం కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ప్రచార భేరిలో సీఎం మాట్లాడారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయన్నారు. ఎవరు ఎలాంటి నాయకుడో ప్రజలు గమనించాలన్నారు. ఎవరి రికార్డు ఏంటో.. ఎవరి రిపోర్టు ఏంటో చూద్దామా అని జగన్ అన్నారు. ఎవరిది బోగస్, ఎవరిది ప్రోగ్రెస్ అనేది తేల్చుదామా అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తాము చేసిన పనులు మీ కళ్ల ముందు కనిపిస్తున్నాయని.. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed