‘విలువలు లేని తమకే ఇది సాధ్యం!’: పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి ఫైర్

by Disha Web Desk 21 |
‘విలువలు లేని తమకే ఇది సాధ్యం!’: పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి ఫైర్
X

దిశ , డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు టార్గెట్ చేశారు. పవన్ కల్యాణ్ ఎక్కడ కనిపించినా.. ముఖ్యంగా టీడీపీవాళ్లతో టచ్‌లో ఉన్నట్లు తెలిస్తే చాలు మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా విరుచుకుపడుతుంటారు. చిన్న చిన్న కొటేషన్స్‌తో పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడుతుంటారు. అయితే తెలంగాణలో బీజేపీ,జనసేనల పొత్తును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లబోతుంది. ఈ వ్యవహారంపై అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్‌కు ఏదైనా సాధ్యమేనని, విలువలు లేని రాజకీయాలు చేయాలంటే పవన్ కల్యాణ్ మాత్రమే చేయగలడు అంటూ ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు.‘విలువలు లేని తమకే ఇది సాధ్యం!’అని ట్వీట్ చేశారు. పవన్‌తో చంద్రబాబు, కిషన్‌రెడ్డి ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed