‘ఇవి రాజకీయ నోటీసులు’.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2024-11-08 11:57:35  IST  )

ధర్మవరం చెరువును ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారంటూ పాదయాత్రలో మంత్రి లోకేష్(Minister Lokesh) సెల్ఫీ చాలెంజ్(Selfie Challenge) చేసిన విషయం తెలిసిందే.

‘ఇవి రాజకీయ నోటీసులు’.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ధర్మవరం చెరువును ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారంటూ పాదయాత్రలో మంత్రి లోకేష్(Minister Lokesh) సెల్ఫీ చాలెంజ్(Selfie Challenge) చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో చెరువును ఆక్రమించి నిర్మించిన ప్యాలెస్‌ను ఖాళీ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(Former MLA Kethi Reddy Venkatarami Reddy) సోదరుడి భార్య గాలి వసుమతికి రెవెన్యూ అధికారులు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో చెరువును కబ్జా చేశారనే ఆరోపణలతో తన సోదరుడి భార్య వసుమతికి ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడం పై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందించారు. ‘ఈ అంశంలో రాజకీయ కోణం ఉంది. ఈ ఆరోపణలపై కోర్టులో పిటిషన్ విచారణలో ఉన్నా నోటీసులు ఇచ్చారు. దీనిపై కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తా. నా భూములు చాలా క్లియర్‌గా ఉన్నాయి. మేం కబ్జా చేయలేదు’ అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పేర్కొన్నారు.

Next Story