AP Politics: డ్రగ్స్ కేసు నిందితుడు ఇంటికి వైసీపీ మంత్రి.. అందుకోసమేనా..?

by Disha Web Desk 3 |
AP Politics: డ్రగ్స్ కేసు నిందితుడు ఇంటికి వైసీపీ మంత్రి.. అందుకోసమేనా..?
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. పాలకపక్షానికి విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గు మంటోంది. తాజాగా విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా జగన్ వ్యాఖ్యలపై టీడీపీ (X) వేదికగా స్పందించింది. దయ్యాలు వేదాలు వల్లించడం అనే మాట వినడమే కానీ.. ప్రత్యక్షంగా చూడడం ఇదే అని ఏపీ జనం అంటున్నారని పేర్కొంది.

బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తెప్పించింది చంద్రబాబు బంధువులు అయితే.. డ్రగ్స్ కేసులో ఉన్న కూనం పూర్ణచంద్రరావు ఇంటికి నీ మంత్రి మేరుగ నాగార్జునని ఎందుకు పంపించావ్ జగన్? అని ప్రశ్నించింది. సీబీఐ ముందు నీ గుట్టు విప్పొద్దని బతిమాలాడానికా? బెదిరించడానికా? అని ఎద్దేవ చేస్తూ పోస్ట్ టీడీపీ ట్విట్టర్ (X) లో పోస్ట్ చేసింది. కాగా ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed