కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. 8మంది నిందితులు అరెస్ట్

by Disha Web Desk 3 |
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. 8మంది నిందితులు అరెస్ట్
X

దిశ, పుట్టపర్తి: శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువులో ఈనెల 24న తెల్లవారుజామున చికెన్ షాప్ నిర్వహిస్తున్న చలపతి అనే వ్యక్తి కిడ్నాప్ కు గురైన విషయం అందరికి తెలిసిందే.కాగా ఎట్టకేలకు ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నేపథ్యంలో డిఎస్పి వాసుదేవన్ మాట్లాడారు. చలపతికి వరుసకు బావమరిది అయ్యే భానుచందర్ అనే యువకుడు జల్సాలకు అలవాటు పడడ్డారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన స్నేహితుల సహకారంతో చలపతిని కిడ్నాప్ చేసారని తెలిపారు.

కొత్తచెరువు పోలీసులు, ముదిగుబ్బ పోలీసుల సహకారంతో ఏడుగురు నిందితులు ఒక బాల నేరస్థున్ని అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పి వెల్లడించారు. వారి వద్ద నుంచి 8 సెల్ ఫోన్లు 18వందల నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నామన్నారు.కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన కొత్తచెరువు పోలీసులకు నగదు రివార్డులను అందజేయనున్నట్లు తెలియజేశారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టుకు హాజరుపరచనున్నట్లు డి.ఎస్.పి పేర్కొన్నారు.


Next Story

Most Viewed