పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యం.. దుబాయ్ లో మంత్రి నారాయణ బృందం

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ దుబాయ్ (Dubai) పర్యటన ప్రారంభమైంది.

పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యం.. దుబాయ్ లో మంత్రి నారాయణ బృందం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ దుబాయ్ (Dubai) పర్యటన ప్రారంభమైంది. ఆయన బృందం దుబాయ్ కు చేరుకుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా మంత్రి నారాయణ బృందం (Group) దుబాయ్ పర్యటన సాగనుంది. విశాఖపట్నంలో నవంబరు 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను మంత్రి ఆహ్వానించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రముఖ రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ డైరెక్టర్ జ్యోత్స్న హెగ్డే, హెల్త్ కేర్ సంస్థ ఆస్టర్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రి భేటీ అవుతారు. కేఈఎఫ్ హోల్డింగ్స్ చైర్మన్ ఫైజల్, బుర్జిల్ హోల్డింగ్స్ ప్రతినిధులతో విడి సమావేశమవుతారు. అనంతరం దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ (Indian Consulate) జనరల్ సతీశ్ శివన్ తో మంత్రి నారాయణ బృందం భేటీ అవుతుంది.

పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానం..

నవంబర్ 6 వరకు మంత్రి నారాయణ దుబాయ్ లోనే ఉండనున్నారు. సమావేశాల్లో భాగంగా దుబాయ్ పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారు. విశాఖపట్నంలో జరిగే సీఐఐ సదస్సుకు రావాలని ఆహ్వానిస్తారు. సదస్సు వేదికగా పెట్టుబడులు ప్రకటించాలని మంత్రి నారాయణ వారిని కోరనున్నారు.

Next Story