ఇన్విజిలేటర్ నిర్వాకం.. MBBS ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీస్తుండగా చీఫ్ అభ్జర్వర్ సడన్ ఎంట్రీ!

by Disha Web Desk 2 |
ఇన్విజిలేటర్ నిర్వాకం.. MBBS ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీస్తుండగా చీఫ్ అభ్జర్వర్ సడన్ ఎంట్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు మెడికల్ కాలేజీలో ఇన్విజిలేటర్ నిర్వాకం బయటపడింది. MBBS ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీస్తూ ఇన్విజిలేటర్ చక్రపాణి పట్టుబడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు చక్రపాణిని విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25వ తేదీ నుండి ఎంబీబీఎస్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిన్న అనాటమి పేపర్-2 పరీక్షలు జరిగాయి. కర్నూల్ మెడికల్ కాలేజీలో జరిగిన అనాటమీ పేపర్-2 క్వశ్చన్ పేపర్‌ను ఇన్విజిలేటర్ డాక్టర్ చక్రపాణి తన ఫోన్‌లో ఫోటో తీశాడు.

ఈ విషయాన్ని గుర్తించిన చీఫ్ అభ్జర్వర్ డాక్టర్ శ్రీనివాస్ ఇన్విజిలేటర్‌ను నిలదీశారు. సెల్ ఫోన్‌ను పరీక్షా కేంద్రంలోకి ఎలా తీసుకువచ్చారని ప్రశ్నించారు. సమాధానం లేక తప్పించుకొనేందుకు ప్రయత్నించాడు. అనంతరం ఫోన్ తీసుకొని చూడగా.. అనాటమీ పేపర్-2, అనాటమీ పేపర్-1 క్వశ్చన్ పేపర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ చేయనున్నారు.

Next Story