ఏపీ టిడ్కోకు రూ. 540 కోట్లు మంజూరు

by Vemula.Srinu Prasad |

ఏపీ టిడ్కోకు రుణం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది...

ఏపీ టిడ్కోకు రూ. 540 కోట్లు మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర టిడ్కో(Tidco)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. హడ్కో నుంచి తీసుకున్న రుణాన్ని(loan) ముందుగా చెల్లించేందుకు రూ. 540 కోట్లు విడుదల చేసింది. 2025-26 ఏడాదికి గాను రుణాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు నిధులు మంజూరు చేసింది. అలాగే రుణం విడుదలుకు పాలనాపరమైన అనుమతులు సైతం ఇచ్చింది. తదుపరి చర్యలపై టిడ్కోను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్లు ఒక ప్రశ్నగా మారాయి. దీంతో ప్రభుత్వం ఈ ఇళ్లను త్వరగా పూర్తి చేసేందుకు అడుగులు వేసింది. జూన్ 2026 నాటికి రాష్ట్రంవ్యాప్తంగా అన్ని టిడ్కో ఇళ్లను 100 శాతం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం తాజాగా రుణం మంజూరుకు శ్రీకారం చుట్టింది.

Next Story