డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. పొదుపు సొమ్ము వాపస్ ఇచ్చేందుకు అంగీకారం

by Vemula.Srinu Prasad |

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పొదుపు సొమ్మును తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ...

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. పొదుపు సొమ్ము వాపస్ ఇచ్చేందుకు అంగీకారం
X

దిశ, వెబ్ డెస్క్: డ్వాక్రా మహిళ(Dwakra Women)లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పొదుపు సొమ్ము(Podupu Sommu)ను తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ(Finance Department) ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 22 లక్షల మందికి రూ.1194 కోట్లు అకౌంట్లలో జమ కానున్నాయి. ఈ మొత్తాన్ని త్వరలోనే వారికి అందజేయనున్నారు. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము అభయహస్తం(AbayaHastam) పథకం కింద పింఛన్ కోసం పొదుపు చేసుకున్నామని, అయితే ఈ సొమ్మును తిరిగి ఇవ్వడంలేదని తెలిపారు. ఇన్నాళ్టకు ఈ సమస్యను పరిష్కరించిన సీఎం చంద్రబాబుకు పలువురు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story