డిస్కంలకు గుడ్ న్యూస్.. టారిఫ్ సబ్సిడీ నిధుల విడుదల

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-12 09:17:00  IST  )

డిస్కంలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది..

డిస్కంలకు గుడ్ న్యూస్.. టారిఫ్ సబ్సిడీ నిధుల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర డిస్కం(Discoms)లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వినియోగదారులకు బదలాయిస్తున్న టారిఫ్ సబ్సిడీ(Tariff Subsidy)ని భరించాలని ప్రభుత్వం(Government) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అడుగులు వేసింది. టారిఫ్‌‌పై ప్రకటించిన సబ్సిడీ నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.4,470 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 త్రైమాసికానికి నిధులు విడుదల చేసేందుకు పాలనా అనుమతులు ఇచ్చింది. మూడు ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ కోసం నిధులు విడుదల చేసింది. ప్రజలపై భారం పడకుండా సబ్సిడీ మొత్తాన్ని బదలాయించింది. డిస్కంల ఖాతాలో ఈ నిధులను జమ చేయాలని పవర్ కోఆర్డినేషన్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది

Next Story