ఏపీలో టీడీపీ బోణి.. 50 వేల మెజార్టీతో బుచ్చయ్య చౌదరి గెలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-06-04 06:38:23  IST  )

ఏపీలో తొలి విజయం నమోదు అయింది....

ఏపీలో టీడీపీ బోణి.. 50 వేల మెజార్టీతో బుచ్చయ్య చౌదరి గెలుపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో తొలి విజయం నమోదు అయింది. టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి 50 వేల మెజార్టీతో విజయం సాధించారు. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ తరపున ఆయన పోటీ చేశారు. గత ఎన్నికల్లోనూ ఆయన రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు. దీంతో బుచ్చయ్య ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు బాణా సంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం దిశగా కొనసాగుతోంది. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Next Story