Breaking: ఆ రోజే వైసీపీ మేనిఫెస్టో విడుదల

by Disha Web Desk 16 |
Breaking:  ఆ రోజే వైసీపీ మేనిఫెస్టో విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికల జరగున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలపై ఫోకస్ పెట్టాయి. సీఎం జగన్ ఓ అడుగు ముందుకేసి వైసీపీ మేనిఫెస్టో డేట్‌ను ఖరారు చేశారు. ఉగాది రోజున (ఏప్రిల్ 9న) వైసీపీ ఎన్నికల ఫెనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తాజాగా ప్రకటించారు. ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. లబ్ధిదారుల అకౌంట్లో భారీగా నగదును జమ చేసింది. అయితే ఈసారి ఎన్నికల హామీలు ఏమి ఇవ్వబోతున్నారనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో ఉగాదిన తమ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే టీడీపీ 6 గ్యారంటీలు అంటూ రాష్ట్రమంతటా ప్రచారం ప్రారంభించింది. దీంతో వైసీపీ మేనిఫెస్టోపై అంచనాలు భారీగా పెరిగాయి. మేనిఫెస్టోలో అసలు ఎలాంటి అంశాలు పెట్టారనే ఉత్కంఠ నెలకొంది. ఈ సారి కూడా పూర్తిగా సంక్షేమంపైనే హామీలు పొందుపర్చారా లేదంటే అభివృద్ధి, రాజధాని అంశాలపై కూడా మేనిఫెస్టోలో పెట్టారా అనే ప్రశ్నలు ఏపీ ప్రజల మదిలో కదులుతున్నాయి. మరి మేనిఫెస్టో విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి.

Read More..

పిఠాపురం ఎమ్మెల్యేకు సీఎం జగన్ బుజ్జగింపులు.. కీలక హామీ

Next Story