ప్రైవేటు స్కూల్లో ఘర్షణ.. విద్యార్థి మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-14 16:24:08  IST  )

విజయనగరం జిల్లా బొబ్బిలిలో దారుణం జరిగింది...

ప్రైవేటు స్కూల్లో ఘర్షణ.. విద్యార్థి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా(Vizianagaram District) బొబ్బిలి(Bobbili)లో దారుణం జరిగింది. స్థానిక ప్రైవేటు స్కూలులో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో విద్యార్థి మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు కలిసి మెలిసి చదువుకోవాలని, ఘర్షణ పడకూడదని తెలిపారు.

Next Story