ఏపీలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్.. రైఫిల్‌, 10 బుల్లెట్లు స్వాధీనం

by Vemula.Srinu Prasad |

ఏపీలో ఉగ్రవాదుల కలకలం రేగింది...

ఏపీలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్.. రైఫిల్‌,  10 బుల్లెట్లు స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ఉగ్రవాదుల కలకలం రేగింది. సత్యసాయి జిల్లా ధర్మవరం(Dharmavaram)లో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరుల(Terrorist sympathizers)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి సింగిల్ బ్యారెల్ రైఫిల్‌తో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జద్ హుస్సేన్, మహారాష్ట్ర‌కు చెందిన తౌఫిక్ అలాం షేక్ గా గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నట్లు తేలింది.

కాగా ఇటీవలకాలం ధర్మవరంలో నూర్ మహ్మద్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం లోతుగా విచారించారు. దీంతో ధర్మవరంలో మరో ఇద్దరు ఉన్నట్లు నూర్ మహ్మాద్ తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా ఈ రోజు ధర్మవరంలో ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులను అరెస్ట్ చేశారు.

Next Story