నందమూరు లో ఉద్రిక్తత.. బీజేపీ నేతల అరెస్ట్

by Web Desk |
నందమూరు లో ఉద్రిక్తత.. బీజేపీ నేతల అరెస్ట్
X

దిశ, ఏపీ బ్యూరో : కృష్ణా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుడివాడ వెళ్తున్న బీజేపీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నందమూరు అడ్డు రోడ్డు వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, విష్ణువర్థన్ రెడ్డి ఇతరనేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని చెప్పుకొచ్చారు. దీంతో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేశారు. సోము వీర్రాజును ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంక్రాంతి సంబరాలు ముగింపు వేడుకలకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణమని బీజేపీ నేతలు ప్రశ్నించారు. సీఎం జగన్‌కు, వైసీపీ ప్రభుత్వానికి మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు.



Next Story

Most Viewed