అనంతపురం జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ.. వేటకొడవళ్లతో పరస్పరం దాడులు

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా బోడాయిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

అనంతపురం జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ.. వేటకొడవళ్లతో పరస్పరం దాడులు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur District) బోడాయిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల(Two Goups) మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో వేటకొడవళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో మరోసారి ఘర్షణ చెలరేగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించారు. అయితే ఈ వివాదానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story