Breaking: పొత్తుల వేళ కీలక పరిణామం... 2 నియోజకవర్గాలకు టీడీపీ ఇంచార్జుల నియామకం

by Disha Web Desk 16 |
Breaking: పొత్తుల వేళ కీలక పరిణామం... 2 నియోజకవర్గాలకు టీడీపీ ఇంచార్జుల నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: పొత్తుల వేళ తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నియోజకవర్గాలకు ఇద్దరు ఇంచార్జులను ఖరారు చేసింది. ప్రకాశం జిల్లా దర్శితో పాటు కడప జిల్లా రైల్వే కోడూరులో సర్వే చేయించిన అధిష్టానం ఇద్దరు టీడీపీ ఇంచార్జులను ఫైనల్ చేసింది. దర్శికి గోరంట్ల రవికుమార్, రైల్వే కోడూరుకు రూపానందరెడ్డిని ఇంచార్జులుగా నియమిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తెలుగు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఇద్దరు ఇంచార్జులకు సహకరించాలని కోరింది.

కాగా టీడీపీ, జనసేన తొలి లిస్టు విడుదల అయిన విషయం తెలిసింది. తొలి విడతలో 94 మంది టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. జనసేన నుంచి ఐదుగురిని వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు ఇచ్చే అంశాలపై టీడీపీ అధినేత చర్చిస్తున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం వరకూ ఈ మూడు పార్టీల పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉంది.


Next Story

Most Viewed