- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: చంద్రబాబుకే జై కొట్టిన రాయలసీమ
by Vemula.Srinu Prasad |
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దూసుకుపోయింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దూసుకుపోయింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మంగళవారం ఉదయం నుంచి కొనసాగుతోంది. ఈ కౌంటింగ్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోనూ తెలుగుదేశం పార్టీకే ప్రజలు జైకొట్టారు. రాయలసీమ ప్రాంతంలోనూ సీఎం జగన్కు భారీ షాక్ తగిలింది. కర్నూలును మూడో రాజధానిగా ప్రకటించినప్పటికీ ఆ పాచిక పారలేదు. రాయలసీమలో మొత్తం 52 స్థానాలు ఉంటే 40 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. మిగిలిన 12 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అనంతరం, చిత్తూరు, కర్నూలు, కడపలోనూ టీడీపీ గాలి వీచింది.
Next Story






