బ్రేకింగ్: అసెంబ్లీ నుండి TDP ఎమ్మెల్యేలు సస్పెండ్

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: అసెంబ్లీ నుండి TDP ఎమ్మెల్యేలు సస్పెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశంపై ప్రతిపక్ష టీడీపీ ఆదివారం అసెంబ్లీలో నిరసన చేపట్టింది. ఈ అంశంపై చర్చకు డిమాండ్‌ చేస్తూ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ 11 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్‌ చేశారు. టీడీపీ, వైస్సార్ సీపీ నేతల పోటాపోటీ నినాదాలతో అసెంబ్లీ అట్టుడికింది.


Next Story