ఎమ్మెల్యే విజయచంద్ర బూతులు.. పోలీసులకు ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-17 06:06:09  IST  )

పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తీరు వివాదాస్పదంగా మారింది...

ఎమ్మెల్యే విజయచంద్ర బూతులు.. పోలీసులకు ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర(TDP MLA MLA Bonela Vijayachandra) తీరు వివాదాస్పదంగా మారింది. పార్వతీపురం ఎమ్మార్వో విజయలక్ష్మి(MRO Vijayalakshmi)కి ఆయన రాత్రి సమయంలో ఫోన్ చేశారు. అంతేకాదు ఆమెను అసభ్యపదజాలంతో దూషించారు. ఓ భూమి విషయమై ఆయన మామూలు కాల్ చేశారు. అయితే మహిళా ఎమ్మర్వో ఫోన్ లిప్ట్ చేయలేదు. దీంతో ఆయన వాట్సాప్ కాల్ చేశారు. ఫోన్ లిప్ట్ చేయడంతో బూతులు తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వాట్సాప్ కాల్ వైరల్ అయింది. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఎమ్మార్వో ఫిర్యాదు చేశారు. తనను బూతులు తిట్టిన విజయచంద్రపై కేసు నమోదు చేయాలని కోరారు.

అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందించారు. ఎమ్మార్వో కార్యాలయం అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. ఎమ్మార్వో మానసిక పరిస్థితి బాగోలేదని, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Next Story