ఎస్సీ, ఎస్టీలపై దాడులు.. టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం

by Disha Web Desk 16 |
ఎస్సీ, ఎస్టీలపై దాడులు.. టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: ఎస్సీ, ఎస్టీలే టార్గెట్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ మూకలు దాడుల చేస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పత్తిపాడు టీడీపీ ఇంచార్జ్ కారుపై దాడి ఘటనపై ఆయన స్పందించారు. ఎన్నికల వేళ ఎస్సీలను భయపెడుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్లతో వైసీపీ అభ్యర్థి భేటీని ప్రశ్నిస్తే టీడీపీ ఇంచార్జ్‌ కారుపై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు. మాజీ ఐఏఎస్ రామాంజనేయులు కారుపై దాడి చేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా గుంటూరు జిల్లా ప్రతిపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంటున్నారు. పత్రిపాడులో వాలంటీర్లతో వైసీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. తమ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయాలని దిశినిర్దేశం చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో వాలంటీర్లతోర వైసీపీ నాయకులు సమావేశమైన ప్రాంతానికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా వెళ్లారు. టీడీపీ ఇంచార్జ్ ఆంజనేయులు సైతం అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు.అయితే వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. తమ కార్యాలయంపై దాడి చేశారంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ ఇంచార్జ్ రామాంజనేయులు కారుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అప్రమత్తమైన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story