Atchannaidu: ఏపీలో కర్ణాటక సీన్ రిపీట్

by Disha Web Desk 16 |
Atchannaidu
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోనూ కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీ విజయానికి నాంది పలికిందని అలాంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ విజయం తథ్యమని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

వైసీపీ నాలుగేళ్ళ పాలనలో అభివృద్ధి అనేది మచ్చుక అయినా కనిపించడం లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను కేసులతో వేధించడం తప్ప ఇక వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏమైనా ఉందా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ శ్రేణులు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఈ వ్యవహారంలో ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీని అధికార పీఠం నుంచి గద్దె దించి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు టీడీపీ కార్యకర్తలు విశ్రమించొద్దని అచ్చెన్నాయుడు సూచించారు.

Read more:

Amaravati Scam: ఊపందుకున్న దర్యాప్తు.. చంద్రబాబు కరకట్ట ఇల్లు జప్తు

Next Story