నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. ఆ ఫైలుపైనే తొలి సంతకం

by Disha Web Desk 16 |
నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. ఆ ఫైలుపైనే తొలి సంతకం
X

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు టీడీపీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తన తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతానని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తరపున కడప జిల్లా రాజంపేటలో పవన్ కల్యాణ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ యువతకు భరోసా ఇచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం యువతకు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అన్న ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఓట్లు చీలేందుకు వీల్లేదని తాను జైలులో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ చెప్పారన్నారు. ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు గుర్తు చేశారు.

Read More..

కేంద్రమంత్రికి పోటీగా నామినేషన్ వేశాడని కిడ్నాప్!.. ఉపసంహరించుకోవాలని చిత్రహింసలు (వీడియో వైరల్)



Next Story

Most Viewed