Breaking: ఆ మాట చెప్పండి మేడం..రోజాకు చుక్కలు చూపిన శ్రీవారి భక్తులు

by Disha Web Desk 3 |
Breaking: ఆ మాట చెప్పండి మేడం..రోజాకు చుక్కలు చూపిన శ్రీవారి భక్తులు
X

దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆ ఏడుకొండల స్వామిని వేడుకొనేందుకు తిరుమలకి వెళ్లన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రి RK రోజాకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ శ్రీనివానుడిని దర్శించుకుని వస్తున్న రోజాను శ్రీవారి భక్తులు చుట్టుముట్టారు. జై అమరావతి, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు.

జై అమరావతి అనండి మేడం అంటూ రోజాను కోరారు. దీనితో రోజాకు అటుమింగలేను, ఇటు కక్కలేను అనే పరిస్థితి ఎదురైంది. ఇక చేసేదేమి లేక భక్తుల నినాదాల మధ్యరోజ నవ్వుతూ వెళ్లిపోయారు. వైసీపీ మూడు రాజధానులు అంటున్న నేపథ్యంలో తాను జై అమరావతి అంటే టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు అవుతోంది. అలానే కాదు అంటే ఎన్నికల సమయంలో ప్రజల్లో వ్యతిరేకతను కొని తెచ్చుకున్నట్లు అవుతోంది అని అనుకున్నారో ఏమో గాని మాట్లాడకుండా నవ్వుతూ వెళ్లిపోయారు.

ఇక టీడీపీతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన రోజా.. ఆ పార్టీతో విబేధాలు రావడంతో వైసీపీ గూటికి చేరారు. ఇక వైసీపీ నుండి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నారు. ఇక అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న తన కళను నెరవేర్చిన జగన్ కు అండగా జగన్ పై ఈగ వాలిన సహించను అన్నట్లు జగన్ ను ఎవరు విమర్శించిన వారికి తనదైన శైలిలో సమాధానం చేప్తారు రోజ.

ప్రముఖ రాజకీయ నేతలను కూడా తన మాటలతో వణికించే రోజ ఈ రోజు శ్రీవారి భక్తులు అలా చుట్టుముట్టి జై అమరావతి అని చెప్పమని బలవంతం చేసిన ఏ మాత్రం అసహనానికి లోను కాకుండా నవ్వుతూ వెళ్లిపోయారు.


Next Story

Most Viewed