తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. నేడు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

by Dishanational2 |
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. నేడు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. సోమవారం శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు.ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు, తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి 23 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్ ‌లో విడుదల చేయనుంది. భక్తులు యాప్ ద్వారా బుగ్ చేసుకోవాలని తెలిపింది.

అలాగే వృద్ధులు, వికలాంగుల కోట టోకెన్లను ఈనెల 14న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఇక అంగ ప్రదక్షిణంకు సంబంధించిన ఈనెల 23 నుంచి 28 తేదీ వరకుగల టోకెన్లను శనివారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనుంది.



Next Story