Ap News: హృదయవిదారకం.. రిక్షాలో కుమారుడు మృతదేహం తరలింపు

by Disha Web Desk 16 |
Ap News: హృదయవిదారకం.. రిక్షాలో కుమారుడు మృతదేహం తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లాలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో చనిపోయిన కన్న కొడుకు మృతదేహాన్ని తల్లి రిక్షాలో ఇంటికి తీసుకెళ్లారు. పార్వతీపురం సోని వైకేఎం కాలనీకి చెందిన కిషోర్ అనారోగ్యం పాలయ్యాడు. దీంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ కిషోర్ మృతి చెందారు. దీంతో తన కుమారుడు కిషోర్‌ను అంబులెన్స్‌లో తీసుకెళ్లేందుకు తల్లి ఆర్థిక స్థోమత సరిపోలేదు. ఓ రిక్షాలో కిషోర్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. అయితే రిక్షాలో తీసుకెళ్తున్న ఈ దృశ్యాన్ని చూసి పలువురు కంటతడి పెట్టారు. బంధువుల సాయంతో కిషోర్ మృతదేహానికి తల్లి అంత్యక్రియలు నిర్వహించారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లిని ఓదర్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఆ తల్లికి వచ్చిన కష్టాన్ని చూసి గ్రామస్తులు కూడా విషాధచాయల్లో మునిగిపోయారు.

Next Story

Most Viewed