వ్యర్థాల నుంచి సంపద వైపు: నరసన్నపేటలో సరికొత్త ముందడుగు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-16 12:58:25  IST  )

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పరిసరాలను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు అంకితభావంతో కష్టపడి పని చేస్తున్న పారిశుధ్య కార్మికులతో ఆయన ముచ్చటించారు..

వ్యర్థాల నుంచి సంపద వైపు: నరసన్నపేటలో సరికొత్త ముందడుగు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) నరసన్నపేట(Narasannapet)లో సీఎం చంద్రబాబు (Cm Chandrababu) పర్యటించారు. పరిసరాలను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు అంకితభావంతో కష్టపడి పని చేస్తున్న పారిశుధ్య కార్మికులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇంటింటికీ వెళ్లి వ్యర్థాలను సేకరించే 'స్వచ్ఛ రథాలు' క్షేత్రస్థాయిలో శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణను మరింత బలోపేతం చేయడంలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

ఎంతగానో తోడ్పడుతోంది

ఇక వ్యర్థాల వర్గీకరణ ప్రక్రియలో సాంకేతికతను ఎంత సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారో స్వయంగా చూడటం తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఈ ఆధునిక సాంకేతికత పారిశుధ్య పనుల్లో సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, మన పారిశుధ్య కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచడానికి కూడా ఎంతగానో తోడ్పడుతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్లాస్టిక్ బెయిలింగ్, ష్రెడ్డింగ్ ప్రక్రియలను పరిశీలించినప్పుడు.. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా ఎలా ఒక విలువైన వనరుగా మార్చవచ్చో స్పష్టంగా అర్థమైందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సంపద సృష్టికి ఇదొక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోందని చంద్రబాబు తెలిపారు.

సీఎం చంద్రబాబు ట్వీట్..

Next Story