Nellore: 8న జగనన్న భవన్ ప్రారంభం

by Disha Web Desk 16 |
Nellore: 8న జగనన్న భవన్ ప్రారంభం
X

దిశ, నెల్లూరు: నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా జగనన్న భవన్ నిర్మాణం పూర్తయింది. మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తో కొన్ని విభేదాల కారణంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ జగనన్న భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అత్యంత వేగవంతంగా ఈ కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు. ఈనెల 8న ఉదయం 7:49కి అట్టహాసంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లడం ప్రధాన లక్ష్యంగా డిప్యూటీ మేయర్ అనుచరులు పేర్కొన్నారు. వైసీపీ కోసం నిరంతరం పని చేస్తున్న నేతలు, కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉండడం, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేలా జగనన్న భవన్‌ను రూపొందించారు. నెల్లూరు నగరానికి చెందిన కార్పొరేటర్లు వైసీపీ నేతలు, కార్యకర్తలను జగనన్న భవన్ ప్రారంభానికి ఇప్పటికే ఆహ్వానించారు. సిటీ నియోజకవర్గంలో ఈ భవన్ ఏర్పాటుతో నెల్లూరు నగర రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి.


Next Story

Most Viewed