Nellore: కాలువలో పడి ఇద్దరు బాలికలు మృతి.. విలపించిన గ్రామం

by Disha Web Desk 16 |
Nellore: కాలువలో పడి ఇద్దరు బాలికలు మృతి.. విలపించిన గ్రామం
X
  • కాలువలో పడి ఇద్దరు బాలికలు మృతి
  • బాధిత కుటుంబాలకు ఓదార్చిన మంత్రి కాకాని

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. కసుమూరు పంచాయతీ చింతలపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు కనుపూరు కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందారు. బాలికల మరణ వార్త తెలిసిన రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హుటాహుటిన వెంకటాచలం హాస్పిటల్‌కు చేరుకున్నారు. బాలికల మృతదేహాలను చూసి చలించిపోయారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మంత్రిని చూడగానే తమ కష్టాన్ని తెలుపుకుంటూ చింతలపాలెం గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు.



Next Story

Most Viewed