జలదిగ్బంధంలో పొట్టేపాలెం కలుజు.. రాకపోకలకు అంతరాయం

by Vemula.Srinu Prasad |

నెల్లూరు జిల్లాపై దిత్వా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది..

జలదిగ్బంధంలో పొట్టేపాలెం కలుజు.. రాకపోకలకు అంతరాయం
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore)పై దిత్వా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ఇప్పటికీ ఉధృతంగానే ప్రవహిస్తు్న్నాయి. కొన్ని చోట్ల వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుకుంది. దీంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ మేరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాలెం కలుజుపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రహదారి కోతకు గురైంది. ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి ప్రవాహంలో వాహనాలు రాకపోకలు సాగించాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు.

Next Story