బిట్రగుంట రైల్వేస్టేషన్‌లో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

by Disha Web Desk 16 |
బిట్రగుంట రైల్వేస్టేషన్‌లో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
X

దిశ, నెల్లూరు: బోగోలు ఎస్సీ కాలనీకి చెందిన రైల్వే ఉద్యోగి అంబటి కమలేశ్వరరావు (38) బిట్రగుంట రైల్వేస్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్‌ లాలాగూడ రైల్వే వర్క్‌షాప్‌లో ఉద్యోగిగా పని చేసే కమలేశ్వరరావు భార్యతో కలిసి హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. బుధవారం సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో భార్యతో కలిసి కావలి అత్తగారింటికి అని బయలుదేరారు. అయితే భార్యను కావలిలో దింపి అదే ట్రైన్‌లో నెల్లూరు వరకూ వెళ్ళొస్తానని బయలుదేరాడు. రైలు బిట్రగుంట స్టేషన్‌ చేరుకున్న తరువాత ట్రైన్‌ దిగి చక్రాల కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆత్మహత్య కారణాలు తెలియరాలేదు.



Next Story

Most Viewed