- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > బిట్రగుంట రైల్వేస్టేషన్లో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
బిట్రగుంట రైల్వేస్టేషన్లో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
by Disha Web Desk 16 |
X
దిశ, నెల్లూరు: బోగోలు ఎస్సీ కాలనీకి చెందిన రైల్వే ఉద్యోగి అంబటి కమలేశ్వరరావు (38) బిట్రగుంట రైల్వేస్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్ లాలాగూడ రైల్వే వర్క్షాప్లో ఉద్యోగిగా పని చేసే కమలేశ్వరరావు భార్యతో కలిసి హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. బుధవారం సింహపురి ఎక్స్ప్రెస్లో భార్యతో కలిసి కావలి అత్తగారింటికి అని బయలుదేరారు. అయితే భార్యను కావలిలో దింపి అదే ట్రైన్లో నెల్లూరు వరకూ వెళ్ళొస్తానని బయలుదేరాడు. రైలు బిట్రగుంట స్టేషన్ చేరుకున్న తరువాత ట్రైన్ దిగి చక్రాల కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆత్మహత్య కారణాలు తెలియరాలేదు.
Next Story