Nellore: విక్రమ సింహపురి యూనివర్సిటీలో పోస్టర్ల కలకలం

by Disha Web Desk 16 |
Nellore: విక్రమ సింహపురి యూనివర్సిటీలో పోస్టర్ల కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీలో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. ఈ పోస్టర్లలో ఆర్వో వాటర్ ప్లాంట్లను, కూలింగ్ ఫ్రీజ్‌లను రిపేర్ చేయించాలని లేకపోతే న్యాక్ బృందం పర్యటనను అడ్డుకుంటామంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లను ఏబీవీపీ నాయకులు అంటించారు. పది రోజుల క్రితమే ఏబీవీపీ నాయకులు ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రిజిస్ట్రార్‌కి వినతిపత్రం అందించారు. ఆర్‌వో వాటర్ ప్లాంట్లను రిపేరు చేస్తే నెలకు 1,50,000 రూపాయిలు ఖర్చు చేసే వాటర్ క్యాన్ లను కొనాల్సిన అవసరం లేదని ఆ పోస్టర్లలో తెలిపారు. దీంతో విద్యార్ధులకు మెస్ చార్జీలు తగ్గుతాయని ఆ పోస్టర్లలో వివరించారు. విక్రమ సింహపురి విశ్వ విద్యాలయంలోని శుద్ధి జలాల ప్లాంట్లు, కూలింగ్ ఫ్రిజ్లను మరమ్మతులు చేయించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని.. లేకుంటే న్యాక్ బృందం పర్యటనను అడ్డుకుంటామంటూ ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు.

Next Story

Most Viewed