Nellore: తెలుగుదేశం పార్టీకి రూ. కోటి విరాళం

by Disha Web Desk 16 |
Nellore: తెలుగుదేశం పార్టీకి రూ. కోటి విరాళం
X

దిశ, నెల్లూరు సిటీ: మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీకి విరాళాలు వెల్లువెత్తాయి. నెల్లూరు జిల్లా నుంచి కావలికి చెందిన దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి భూరి విరాళం అందజేశారు. నెల్లూరు జిల్లాలో పలువురు తెలుగుదేశం నాయకులు రెండు లక్షలు, ఐదు లక్షలు, 10 లక్షలు, 25 లక్షల వరకు పార్టీ విరాళాలు అందజేయగా కావ్య కృష్ణారెడ్డి ఒక్కరే కోటి రూపాయల మేర విరాళం అందజేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే కావ్య కృష్ణారెడ్డి పార్టీలకు నిధులు అందజేయడంలో కూడా తాను ముందు ఉంటానని మహానాడు వేదికగా రుజువు చేశారు. కృష్ణారెడ్డి భూరి విరాళం అందజేయడంపై కావలి నియోజకవర్గంలో చర్చలు జోరందుకున్నాయి.

ఇదిలా ఉండగా కావలి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఐదు లక్షలు విరాళం అందజేశారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కాకర్ల సురేష్ 25 లక్షలు అందజేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం చెందిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 10 లక్షల రూపాయలు విరాళం పార్టీ నిధికి అందజేశారు.

Next Story

Most Viewed