దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది: నారా లోకేశ్ సంచలన ఆరోపణలు

by Disha Web Desk 21 |
దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది: నారా లోకేశ్ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ను తీసుకువచ్చింది. ఈ దిశయాప్‌ను మహిళా పోలీసులు మరీ దగ్గరుండి డౌన్ లోడ్ చేయిస్తున్నారు. దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటే ఆపదలో ఉన్నప్పుడు క్షణాల్లో పోలీసులు వచ్చి మీకు రక్షణ కల్పిస్తారని వైసీపీ ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ దిశ యాప్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. మహిళలకైతే ఒకే.... పురుషుల మొబైల్స్‌లో ఆ యాప్‌ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడంపై నారా లోకేశ్ అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.‘యాప్ ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడమేంటని ప్రశ్నించినందుకు అనకాపల్లి జిల్లా రేగుపాలేనికి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లాపై పోలీసులు గుండాల్లా మారి దాడి చేశారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు దాడికి సంబంధించిన వీడియోను లోకేశ్ ట్విటర్‌లో అప్‌లోడ్ చేశారు. ‘జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తెచ్చిన దిశా చట్టంకి దిక్కూ మొక్కూ లేదు. మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది. మహిళలు వేసుకోవాల్సిన దిశ యాప్ పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకి తావిస్తోంది. ఇదే విషయాన్ని ప్రశ్నించిన అనకాపల్లి జిల్లా రేగుపాలేనికి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లాపై పోలీసులు గూండాల్లా దాడి చేయడం దారుణం. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు, ఏపీకి వస్తే ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి’ అని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed