- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అధికార వైసీపీ అండతోనే స్మగ్లర్ల రాజ్యం నడుస్తోంది : నాదెండ్ల మనోహర్
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ప్రభుత్వ అండతోనే రాష్ట్రంలో స్మగ్లర్ల రాజ్యం నడుస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి శేషాచలం అడువుల్లో విలువైన ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించే ముఠాకు వైసీపీ నాయకులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లాలో కానిస్టేబుల్ను వాహనంతో ఢీకొట్టి హత్య చేశారని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పేర్కొన్నారు. ఘటనపై వెంటనే ఎంక్వయిరీ వేసి దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా ఏఆర్ కానిస్టేబుల్ గణేశ్ కుటుంబానికి ధైర్యం చెబుతూ సానుభూతిని వ్యక్తం చేశారు. స్మగ్లర్ల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు.
- Tags
- nadendla manohar
Next Story