- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు..

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 10 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ దర్శనాల కోసం టోకెన్ల జారీ ప్రక్రియ తిరుపతి కేంద్రాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి ప్రారంభంకానుంది. దీంతో భక్తులు భారీగా తరలివచ్చి క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఒకరిపై ఒకరు పడటంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడక మృతి చెందారు. సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం ఆరుగురు మృతి చెందారు. గాయపడిన వారికి రుయాలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. రేపు ఉదయం తిరుపతి వెళ్లనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు.






