ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

by Naga Rani Yarlagadda |

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో జరిగిన ఈ స్కామ్ పై సిట్ (SIT) ఛార్జిషీట్ దాఖలు చేసింది. 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జిషీట్ ను రెడీ చేసిన అధికారులు.. దానిని కోర్టుకు సమర్పించారు. ఆ ఛార్జిషీటుతో పాటు 100కు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కూడా జతచేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 268 మంది సాక్ష్యుల్ని విచారించామని పేర్కొన్న సిట్.. 11 మంది వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు, ఇతర పత్రాలను కూడా జతచేశారు.

Next Story