- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan kalyan: వెండితెరే వేదిక.. థియేటర్లో పవన్తో ‘మాటా మంతి’
పవర్స్టార్గా పవన్కల్యాణ్థియేటర్లోని తెరపై కనిపిస్తే అభిమానుల్లో సందడి నెలకొంటుంది.

• థియేటర్లోనే ప్రజలతో ఆన్లైన్లో ముఖాముఖి
• డీసీఎం పవన్ కళ్యాణ్ యోచన
* ప్రజలకు చేరువయ్యేలా వినూత్న ఆలోచన
* రేపు టెక్కలి గ్రామంలోని థియేటర్లో వీడియో సమావేశం
* 175 నియోజకవర్గాల్లో ఇదే తరహా మీటింగులు
దిశ, డైనమిక్ బ్యూరో : పవర్స్టార్గా పవన్కల్యాణ్థియేటర్లోని (Theater's) తెరపై కనిపిస్తే అభిమానుల్లో సందడి నెలకొంటుంది. అదే వెండితెరపై ఆయన ఉపముఖ్యమంత్రి స్థానంలోంచి ప్రజలకు కనిపించనున్నారు. వెండితెరనే వేదికగా చేసుకుని ప్రజలతో ఆన్లైన్లో ముఖాముఖి నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి మన ఊరు - మాటా మంతి (Mana ooru Mata manti అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమం కార్యక్రమం రేపు టెక్కలి నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో వెండితెర ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వనున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ (Vedio conference) ద్వారా స్థానిక ప్రజలతో పవన్కల్యాణ్మాట్లాడతారు. గ్రామీణులతో నేరుగా మాట్లాడే విధంగా స్థానిక సినిమా హాళ్లను వాడుకోవాలని యోచిస్తున్నారు. పబ్లిక్, ప్రైవేటు, పంచాయతీరాజ్, పార్టనర్షిప్తో గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టడం దీని ఉద్దేశం. మొదటి దశలో రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వారిత తాగునీరు, ఆస్పత్రి, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించాలని నిర్ణయించారు. గ్రామస్థులకు దగ్గరగా ఉన్న థియేటర్లో వీడియో కాన్ఫరెన్స్నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల గ్రామస్తులతో ఇదే తరహాలో మాట్లాడాలని పవన్యోచిస్తున్నట్లు సమాచారం. రేపు శ్రీకాకుళం జిల్లా రావివలస ప్రజలతో సమావేశం కానున్నారు. వీరితో టెక్కలి (Tekkali) సినిమా హాలులో వీడియో కాన్ఫరెన్స్ద్వారా మాట్లాడతారు.






