ఏపీలో సంచలనం.. ఒకేసారి 17 మంది న్యాయవాదులపై వేటు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-20 15:14:23  IST  )

రాష్ట్రంలో పెను సంచలన నమోదు అయింది...

ఏపీలో సంచలనం.. ఒకేసారి 17 మంది న్యాయవాదులపై వేటు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పెను సంచలన నమోదు అయింది. ఒకేసారి 17 మంది న్యాయవాదులు(Lawyers) వేటుకు గురయ్యారు. క్రమశిక్షణా రాహిత్యంగా వ్యహరించినందుకు రాష్ట్రవ్యాప్తంగా పీపీలు, ఏపీపీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పలు కోర్టులో పని చేసే ఇద్దరు పీపీలు, 15 మంది ఏపీపీలను తొలగించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ సిఫార్సు మేరకు వారిపై వేటు పడింది. కర్నూలు డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు పీపీ ఎమ్. వెంకట్ రెడ్డితో పాటు ఒంగోలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు పీపీ వసుంధరను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు పలు కోర్టులో పని చేసే ఏపీపీలను కూడా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Next Story