సుపరిపాలనను తట్టుకోలేకే.. జగన్ కుట్రలు..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-04 16:15:26  IST  )

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

సుపరిపాలనను తట్టుకోలేకే.. జగన్ కుట్రలు..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)పై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టిందుకే ఆయన కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్(Former Cm Jagan MOhan Reddy) పరామర్శ నేపథ్యంలో గుంటూరు(Guntur)లో నెలకొన్న పరిస్థితులపై అనగాని సత్యప్రసాద్ స్పందించారు.

సుపరిపాలనపై కుట్రలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని, అది చూసి తట్టుకోలేకపోతున్నారని మంత్రి అనగాని మండిపడ్డారు. అందుకే దండయాత్రలకు తన పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. సింగయ్య కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కుల మతాల మధ్య చిచ్చుపెట్టే వారిని జగన్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపంచారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అసభ్యలు చేస్తే.. ఆయన్ను జగన్ వెనుకేసుకొస్తున్నారని మంత్రి అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాళ్ల ముగ్గురు లెంపలేసుకోవాలి: వైఎస్ జగన్ సంచలన డిమాండ్

Next Story