షర్మిలను ప్యాక్ చేసి హైదరాబాద్ పార్సిల్ చేస్తాం.. రోజా హాట్ కామెంట్స్

by Disha Web Desk 5 |
షర్మిలను ప్యాక్ చేసి హైదరాబాద్ పార్సిల్ చేస్తాం.. రోజా హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాన్ లోకల్ పోలిటీషియన్స్ ని హైదరాబాద్ పంపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. అనంతపురంలో జరిగే సభా కార్యక్రమాల గురించి మాట్లడుతూ.. ఈ తరహ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎన్ని్కల శంఖారావం పూరించారని, ఆ ఎన్నికల సభ చూస్తేనే.. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్దం అయ్యారని అందరికి అర్ధం అవుతుందని తెలిపారు. కానీ వచ్చిన జనాన్ని చూస్తే.. రాష్ట్ర ప్రజలందరూ జగనన్న వైపే ఉన్నారని, జగనన్నని సీఎం చేయడానికి సిద్దంగా ఉన్నారని.. ప్రతిపక్షాలకు కూడా మీటింగ్ చూసి అర్ధం అయ్యిందని అన్నారు.

అలాగే ప్రతిపక్షాలలో నాన్ లోకల్ పోలిటీషియన్లు ఉన్నారని, వారిని ప్యాక్ చేసి హైదరాబాద్ కి పార్సిల్ పంపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతకు మించిన మీటింగ్ అనంతపురంలో జరుగబోతుందని తెలిపారు. ఎందుకంటే రాయలసీమలో గత రెండు ఎలక్షన్లలో అత్యధిక సీట్లను గెలిపించి, జగనన్నకి అండగా నిలిచిన ప్రాంతం అని గుర్తుచేశారు. అలాగే జగనన్న గెలిస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందని, అభివృద్ది చెందుతుందని ప్రజల్లో బలమైన నమ్మకం ఉందని.. అందుకే అనంతపురం మీటింగ్ సూపర్ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Read More..

పవన్‌‌ను ఓడించేందుకు వైసీపీ బిగ్ స్కెచ్.. రంగంలోకి ఆమె..!


Next Story

Most Viewed