Road Accident: బెస్తవారి పేట వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

by Ramesh Goud |

పొగమంచు కారణంగా ముందు వెళుతున్న ట్రాక్టర్ ను ఓ కారు వెనుక నుంచి ఢీ కొట్టింది.

Road Accident: బెస్తవారి పేట వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్స్: పొగమంచు కారణంగా ముందు వెళుతున్న ట్రాక్టర్ ను ఓ కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో(Accident) ఒక వ్యక్తి మృతి(One Person Died) చెందగా.. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ప్రకాశం జిల్లా(Prakasam District) బెస్తవారిపేట(Bestavaripet) మండలం శాంతినగర్(Shantinagar) వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) సంభవించింది. ఉదయాన్నే పొగమంచు(Fog) కమ్మి ఉండటంతో హైవేపై ముందు వెళుతున్న ట్రాక్టర్(Tractor) కనిపించక ఓ కారు(Car) వేగంగా వెళ్లి వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులుఅనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story